వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పండి

ABN , First Publish Date - 2022-08-10T05:31:31+05:30 IST

అధిక ధరలతో ప్రజలపై వైసీపీ ప్రభుత్వం భారం మోపడం అన్యాయమని, ఆ అరాచక పాలనకు ప్రజలు స్వప్తి చెప్పాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ అన్నారు.

వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పండి
బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు



‘బాదుడే బాదుడు’లో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ 


అనంతపురం అర్బన, ఆగస్టు 9 : అధిక ధరలతో ప్రజలపై వైసీపీ ప్రభుత్వం భారం మోపడం అన్యాయమని,  ఆ అరాచక పాలనకు ప్రజలు స్వప్తి చెప్పాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ అన్నారు. మంగళవారం అనం తపురం అర్బన పరిధిలోని నారా లోకేష్‌ కాలనీ, సుశీల్‌రెడ్డి కాలనీ, రామకృష్ణ కాలనీల్లో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సరిపూటి రమణ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిపించి, నారా చంద్రబాబునాయుడును తిరిగి సీఎం అయ్యేలా అందరూ సహకరించాలని కోరారు. ఇందులో క్లస్టర్‌ ఇనచార్జి, టీడీపీ బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు గోపాల్‌ గౌడ్‌, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బంగి నాగ, హ్యుమన రైట్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు చంటి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నారాయణస్వామి యాదవ్‌, నగర అధ్యక్షుడు మారుతీకుమార్‌ గౌడ్‌, నాయకులు కూచి హరి, గంగవరం బుజ్జి, సిరిసాల రాంబాబు, శ్రీకాంత, సున్నం శ్రీనివాసులు, రమణ, కృష్ణ, మల్లికార్జున, కేశవ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T05:31:31+05:30 IST