2.10లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2022-05-17T06:45:41+05:30 IST

జిల్లాలో ఇప్పటివరకు 2.10లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని డీఎ్‌సవో వి.వెంకటేశ్వర్లు తెలిపారు. శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు, అడ్లూరు ఐకేపీ కేంద్రాలు, మా దారం, శాలిగౌరారంలో పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కేతేపల్లి మండలంలోని కొప్పోలు ఐకేపీ కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

2.10లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
కేతేపల్లి మండలంలోని కొప్పోలు ఐకేపీ కేంద్రంలో వివరాలు తెలుసుకుంటున్న జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు

డీఎ్‌సవో వెంకటేశ్వర్లు

శాలిగౌరారం, కేతేపల్లి, మే 16: జిల్లాలో ఇప్పటివరకు 2.10లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని డీఎ్‌సవో వి.వెంకటేశ్వర్లు తెలిపారు. శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు, అడ్లూరు ఐకేపీ కేంద్రాలు, మా దారం, శాలిగౌరారంలో పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కేతేపల్లి మండలంలోని కొప్పోలు ఐకేపీ కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదే విధంగా వల్లాలలోని సాయిబాలాజీ పార్‌బాయిల్డ్‌ మిల్‌లో ని ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాసంగి సీజన్‌లో 5లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అంచ నా వేసినట్లు తెలిపారు. అనుకున్నంత ధాన్యం లేదని, ఇంకా లక్ష టన్ను ల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు 2.10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.150.66కోట్లు జమ చేశామ ని తెలిపారు. జిల్లాలో 95శాతం వరికోతలు పూర్తయ్యాయని, ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఉంటాయని, ఆ తరువాత మూతపడుతాయన్నారు. ఆయన వెంట ఏసీఎ్‌సవో నిత్యానందం, డీటీసీఎస్‌ జ్యోతి, ఏపీఎం జానకి, నిమ్మల ఆంజనేయులు ఉన్నారు.

Updated Date - 2022-05-17T06:45:41+05:30 IST