భార్య వద్దంటున్నా 34 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొన్న వ్యక్తి.. చివరకు అతనికి దక్కినది ఎంతో తెలుసా..?
ABN , First Publish Date - 2022-04-24T21:21:58+05:30 IST
అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.
అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. ఏదో ఓ రోజు తనకు లాటరీ తగలకపోతుందా అని 34 ఏళ్లుగా ఎదురు చూసిన ఓ వ్యక్తి చివరకు బంపరాఫర్ దక్కించుకున్నాడు. లాటరీలో ఏకంగా రూ.2.5 కోట్ల ప్రైజ్ మనీ కొట్టేశాడు. పంజాబ్లోని భటిండా జిల్లాకు చెందిన రోషన్ బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు.
రోషన్కు లాటరీ టికెట్స్ కొనడం అలవాటు. ఒకటి కాదు.. రెండు కాదు.. 34 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నాడు. లాటరీ టికెట్స్కు డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నాడని భార్య ఎప్పుడూ అతడిని తిడుతుండేది. అన్నేళ్లలో రోషన్కు రూ. 100, 200కి మించి ఎప్పుడూ ప్రైజ్లు రాలేదు. అయినా అతను ఆశ కోల్పోకుండా లాటరీ టికెట్లను కొంటూనే ఉన్నాడు. తాజాగా పంజాబ్ స్టేట్ డియర్ వైశాఖి బంపర్ లాటరీలో మెగా ప్రైజ్ గెలుపొందాడు.
బంపర్ ప్రైజ్ గెలుచుకున్నట్టు రోషన్కు డీలర్ నుంచి ఫోన్ కాల్ రాగా.. అది ఫ్రాంక్ కాల్ అనుకున్నాడు. అనంతరం నిజం తెలుసుకుని ఎగిరి గంతేశాడు. లాటరీ ప్రైజ్ గెలుచినట్టు తెలుసుకున్న రోజు రాత్రంతా నిద్రపోలేదని రోషన్ తెలిపాడు. కాగా, లాటరీలో వచ్చిన రూ.2.5 కోట్ల ప్రైజ్ మనీలో పన్నులన్నీ తీసివేయగా రాకేష్కు రూ 1.75 కోట్లు వస్తాయి. ఆ డబ్బుతో కొత్త వ్యాపారం పెడతానని రాకేష్ చెప్పాడు.