రైతులపై ఆర్‌పీఎఫ్ కేసుల ఎత్తివేతకు సీఎం ఆదేశం

ABN , First Publish Date - 2021-10-02T21:52:00+05:30 IST

మూడు వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి..

రైతులపై ఆర్‌పీఎఫ్ కేసుల ఎత్తివేతకు సీఎం ఆదేశం

చండీగఢ్: మూడు వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల విజ్ఞప్తి చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్ని శనివారంనాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ధర్నాల సందర్భంగా రైల్వే ట్రాకులపై బైఠాయించిన రైతు సంస్థల సభ్యులపై ఆర్‌పీఎఫ్ నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కిసాన్ సంస్థల సభ్యులపై ఆర్‌పీఎఫ్ నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని రైల్వే బోర్డు చైర్మన్‌ను సీఎం కోరారు. ఈ మేరకు ఆర్‌పీఎఫ్‌కు సీఎం లేఖ కూడా రాశారు.


ప్రధాని నరేంద్ర మోదీని శుక్రవారంనాడు ఢిల్లీలో కలిసిన మరుసటి రోజే పంజాబ్ సీఎం తాజా ఆదేశాలు జారీ చేయడం విశేషం. తమ సమావేశంలో రైతు సమస్యలు చర్చకు రావడంతో పాటు, మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరినట్టు చన్నీ శుక్రవారంనాడు మీడియాకు తెలిపారు. ప్రధాని ఎంతో ఓపిగ్గా తాను చెప్పినది విన్నారనీ, సమస్యకు పరిష్కారం జరగాలని ప్రధాని కూడా కోరుకుంటున్నారని చెప్పారు. చర్చలు పునరుద్ధరించాలని తాను ప్రధానిని కోరినట్టు సీఎం వివరించారు.

Updated Date - 2021-10-02T21:52:00+05:30 IST