అప్పు పేరిట లక్ష మొక్కలు నాటుతాం

ABN , First Publish Date - 2022-02-02T16:43:08+05:30 IST

ప్రేక్షకుల హృదయాలలో ‘అప్పు’గా ముద్రపడిన పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అ

అప్పు పేరిట లక్ష మొక్కలు నాటుతాం

                     - సోదరుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌


బెంగళూరు: ప్రేక్షకుల హృదయాలలో ‘అప్పు’గా ముద్రపడిన పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అప్పు అన్న నటుడు రాఘవేంద్రరాజ్‌కుమార్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అప్పు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారన్నారు. ఆయన కనుమరుగై మూడు నెలలు దాటాయంటే నమ్మశక్యం కాలేదన్నారు. కాగా ప్రెస్‌క్లబ్‌లో లాలి లాలి మలగు రాజకుమార గీతనమన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గాయకుడు రాజేశ్‌కృష్ణన్‌, మీడియా అకాడమీ అధ్యక్షుడు సదాశివషెణై తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2022-02-02T16:43:08+05:30 IST