Puneeth Rajkumar: నవంబరు 1న పునీత్‌కు కర్ణాటక రత్న ప్రదానం

ABN , First Publish Date - 2022-08-06T17:08:07+05:30 IST

శాండల్‌వుడ్‌ ప్రముఖ నటుడు, దివంగత పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar)కు ప్రకటించినట్టుగానే నవంబరు 1న కన్నడ

Puneeth Rajkumar: నవంబరు 1న పునీత్‌కు కర్ణాటక రత్న ప్రదానం

                                 - లాల్‌బాగ్‌ ఫ్లవర్‌షో ప్రారంభంలో సీఎం


బెంగళూరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): శాండల్‌వుడ్‌ ప్రముఖ నటుడు, దివంగత పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar)కు ప్రకటించినట్టుగానే నవంబరు 1న కన్నడ రాజ్యోత్సవం వేళ కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) వెల్లడించారు. లాల్‌బాగ్‌లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఫ్లవర్‌ షోను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. కన్నడ కంఠీరవ డాక్టర్‌ రాజ్‌కుమార్‌ సొంతూరు గాజనూరులోని నివాసం రూపకల్పనలో ఫ్లవర్‌ షో ఏర్పాటైంది. రాజ్‌కుమార్‌, పార్వతమ్మ దంపతుల ఫొటోలతోపాటు రాజ్‌, పునీత్‌ విగ్రహాలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఫలపుష్ప ప్రదర్శనల ఏర్పాటు అనాదిగా వస్తోందని, కొవిడ్‌ కారణంగా వరుసగా రెండేళ్లు సాధ్యం కాలేదన్నారు. ఫ్లవర్‌ షో(Flower show) ప్రత్యేకంగా నిలిచిందని ఉద్యానవనశాఖ అధికారులను, కళాకారులను ప్రశంసించారు. ఉద్యానవన శాఖ మంత్రి మునిరత్న మాట్లాడుతూ 1922 నుంచి ఫ్లవర్‌ షో కొనసాగుతోందన్నారు. పదిరోజులపాటు ప్రదర్శనలు ఉంటాయన్నారు. పునీత్‌ భార్య అశ్విని(Puneeth's wife Ashwini), సోదరులు శివరాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌తోపాటు పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి, ఎమ్మెల్యేలు ఉదయ్‌ గరుడాచార్‌, రేణుకాచార్య, మాజీ ఎమ్మెల్సీ శరవణ పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-06T17:08:07+05:30 IST