పునీత్కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
ABN , First Publish Date - 2021-10-30T00:59:51+05:30 IST
కన్నడ సూపర్స్టార్ పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో శనివారంనాడు జరపనున్నారు. కర్ణాటక మంత్రి..
బెంగళూరు: కన్నడ సూపర్స్టార్ పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో శనివారంనాడు జరపనున్నారు. కర్ణాటక మంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. పునీత్ రాజ్కుమార్ పార్థివ దేహాన్ని శనివారం సాయంత్రం వరకూ ప్రజాసందర్శనార్ధం కంఠీరవ స్టేడియంలో ఉంచాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పునీత్ పెద్ద కుమార్తె వందిత అమెరికా నుంచి రావాల్సి ఉన్నందున శనివారం అంత్యక్రియలు జరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు.
కాగా, పునీత్కుమార్ను మధ్యాహ్నం 11.30 గంటలకు విక్రమ్ ఆసుపత్రి తీసుకురావడానికి ముందే ఆయన గుండె ఆగిపోయిందని ఆయనకు చికిత్స అందించిన కార్డియాలజిస్ట్ డాక్టర్ రంగనాథ్ నాయక్ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపారు. గుండె ఆగిపోయినట్టు తాము గుర్తించినప్పటకీ కార్డియాక్ మెసేజ్, షాక్ థెరపీ, వెంటిలేటర్ అమర్చడంతో సహా అన్నిరకాల ప్రయత్నాలు చేశామని, అయితే తమ ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు.