రామలింగేశ్వరుడికి సప్త నదీ జలాభిషేకం

ABN , First Publish Date - 2022-05-23T05:18:58+05:30 IST

పట్టణంలోని శ్రీరాంపురం రామలింగేశ్వరస్వామి (సుబ్బారాయుడుగుడి) ఆలయంలో విగ్రహం ప్రతిష్ఠించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం సప్త నదీ జలాభిషేకం, శాంతి కల్యాణం నిర్వహించారు.

రామలింగేశ్వరుడికి సప్త నదీ జలాభిషేకం

భీమవరం టౌన్‌, మే 22: పట్టణంలోని శ్రీరాంపురం రామలింగేశ్వరస్వామి (సుబ్బారాయుడుగుడి) ఆలయంలో విగ్రహం ప్రతిష్ఠించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం సప్త నదీ జలాభిషేకం, శాంతి కల్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకుడు మొవ్వా శంకరం ఆధ్వర్యంలో ఉదయం విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి అష్టోత్తర కలశాలకు పూజలు చేసి సప్త నదీ జాలాలు  నింపి పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించి మహాన్యాసపూర్వకంగా స్వామివారికి పంచామృతాలు, వివిధ రకాలపండ్ల రసాలు, నదీ జలాలతో అభిషేకాలు చేశారు. అనంతరం మారేడు దళాలతో బిల్వార్చన చేశారు. సాయంత్రం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో రుద్రహోమం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారికి, అమ్మవారికి శాంతి కల్యాణం చేశారు.

Updated Date - 2022-05-23T05:18:58+05:30 IST