మద్ది క్షేత్రంలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2021-10-20T05:13:52+05:30 IST
గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి క్షేత్రం మంగళవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది.
జంగారెడ్డిగూడెం, అక్టోబరు 19: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి క్షేత్రం మంగళవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొవిడ్ నిబంధనల మధ్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. జంగారెడ్డిగూడెం ము న్సిపల్ కమిషనర్ సీహెచ్.శ్రావణ్కుమార్ కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు అసౌకర్యం కల్గకుండా ఆలయ పర్యవేక్షకుడు లోక్నాథ్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టినట్టు ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కీసరి సరితా విజయభాస్కరరెడ్డి, ఈవో ఆకుల కొండలరావు తెలిపారు.