పుదుచ్చేరిలో రాజకీయ కలకలం
ABN , First Publish Date - 2021-01-26T06:40:43+05:30 IST
స్కు రాజీనామా యానాం, జనవరి 25: పుదుచ్చేరిలో రాజకీయ కలకం రేగింది. పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపనుశాఖ మంత్రిగా ఉన్న నమశ్శివాయః, ఉడుస్సు ఎమ్మెల్యే టి.పాండియ్యాన్లు శాసన సభ్యత్వానికి రాజీనామ చేశారు.
మంత్రి, ఎమ్యెల్యే కాంగ్రెస్కు రాజీనామా
యానాం,
జనవరి 25: పుదుచ్చేరిలో రాజకీయ కలకం రేగింది. పుదుచ్చేరి కాంగ్రెస్
ప్రభుత్వంలో ప్రజాపనుశాఖ మంత్రిగా ఉన్న నమశ్శివాయః, ఉడుస్సు ఎమ్మెల్యే
టి.పాండియ్యాన్లు శాసన సభ్యత్వానికి రాజీనామ చేశారు. రాజీనామా పత్రాలను
స్పీకర్ శివకోలంధుకు అందజేశారు. కొన్నాళ్లుగా సీఎం నారాయణసామి పుదుచ్చేరి
అభివృద్ధికోసం పోరాడకుండా గవర్నర్తో పోరాటం సాగించారని, ఈవిషయాన్ని
పలుమార్లు అధిష్ఠానానికి తెలియజేసినా పట్టించుకోక పోవడంతో పార్టీనుంచి
వైదోలుగుతున్నామని వారు తెలిపారు. త్వరలో తన కార్యాచరణ తెలియజేస్తామన్నారు.
ఈనెల31న పుదుచ్చేరి పర్యటనకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా
సమక్షంలో బీజేపీలో వారితో పాటు పలువురు ఎమ్మెల్మేలు చేరే అవకాశం ఉంది.