రాజ్యాంగంపై సీఎం వ్యాఖ్యలు వందశాతం కరెక్ట్: Jeevan reddy

ABN , First Publish Date - 2022-02-03T18:36:28+05:30 IST

రాజ్యాంగాన్ని కొత్తగా రాయలన్న కేసీఆర్ వ్యాఖ్యలను తాముము సమర్దిస్తున్నామన్నామని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు.

రాజ్యాంగంపై సీఎం వ్యాఖ్యలు వందశాతం కరెక్ట్: Jeevan reddy

హైదరాబాద్: రాజ్యాంగాన్ని కొత్తగా రాయలన్న కేసీఆర్ వ్యాఖ్యలను తాముము సమర్దిస్తున్నామన్నామని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగం గురించి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వందశాతం కరెక్ట్ అని స్పష్టం చేశారు.  ఇంతపెద్ద దేశంలో దళితుల కోసం కేవలం 12వేల కోట్లు బడ్జెట్ పెడతారా? అని ప్రశ్నించారు.  ఇదేనా దళితులపై బీజేపీకి ఉన్న ప్రేమా?అని నిలదీశారు. రేవంత్ రెడ్డి- బండి సంజయ్ గల్లీలో కొట్లాడుతారని.. ఢిల్లీలో దోస్తాన్ చేస్తారని అన్నారు. అంబేద్కర్‌ను అవమానించిన బీజేపీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదన్నారు. భీమ్ దీక్ష - ఆందోళన దీక్షలు చేస్తామన్న పార్టీలు అంబేడ్కర్ ఆశయాలను ఎందుకు అమలు చేయడం లేదని ఆయన అడిగారు. దళితబంధు - రైతుబంధు లాంటి పథకాలు దేశం అంతటా అమలు జరిగే విధంగా రాజ్యాంగం రాసుకుందాం అనే మాటల్లో తప్పేముందన్నారు. బీజేపీది గాడ్సే ఇజం అయితే ఆరెస్ ది అంబెడ్కర్ ఇజమని స్పష్టం చేశారు. వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వ్యక్తులకు మంత్రి పదవి ఇచ్చింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ అప్పుల గురించి మాట్లాడే బీజేపీ నాయకులు కేంద్రం చేసిన అప్పుల గురించి కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు. 14 మంది ప్రధానులు 56 లక్షల కోట్లు అప్పులు చేస్తే - ఒక్క మోడీనే 80 లక్షల కోట్ల అప్పులు చేసింది నిజం కాదా? అని జీవన్ రెడ్డి నిలదీశారు. 

Updated Date - 2022-02-03T18:36:28+05:30 IST