రేవంత్ డ్రామాలు ఆపితే మంచిది: జీవన్రెడ్డి
ABN , First Publish Date - 2021-08-26T18:36:57+05:30 IST
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి డ్రామాలు ఆపితే మంచిదని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి డ్రామాలు ఆపితే మంచిదని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పవర్లోకి రాలేమని గ్రహించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మల్లారెడ్డి, మైనంపల్లి మాట్లాడితేనే తట్టుకోలేకపోతున్నారని..ఇక వందమంది ఎమ్మెల్యేలు మాట్లాడితే తట్టుకోగలరా అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి భాష మార్చుకుంటే మంచిదని హితవుపలికారు. అధికార పార్టీ నేతలు భూములు కబ్జా చేస్తే.. ఆధారాలతో బయటపెట్టాలని జీవన్రెడ్డి సవాల్ విసిరారు.