ప్రజా సంక్షేమం గాలికి..
ABN , First Publish Date - 2020-08-14T09:25:10+05:30 IST
రాజధానుల పేరు చెప్పుకుని వైసీపీ, టీడీపీలు నాటకాలు ఆడుతూ ప్రజల సంక్షేమా న్ని గాలికి వదిలేశాయని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ రా
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కమిటీ సభ్యుడు చిలకం మధుసూదన్రెడ్డి
ధర్మవరంఅర్బన్, ఆగస్టు 13: రాజధానుల పేరు చెప్పుకుని వైసీపీ, టీడీపీలు నాటకాలు ఆడుతూ ప్రజల సంక్షేమా న్ని గాలికి వదిలేశాయని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ రాష్ట్ర కమిటీ సభ్యుడు చిలకం మధు సూదన్రెడ్డి విమర్శించారు. పట్టణంలో ఆయన తన స్వ గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. అభివృద్ధిని అధికార పక్షం గాలికివదిలేస్తే ప్రతిపక్షం ప్రజా సమస్యల బాధ్యతను మరిచిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాజధాని పేరు చెప్పి అధికార పక్షం ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తోం దని విమర్శించారు.
ప్రతిపక్షం రాజధాని విషయం తప్పా మిగిలిన అన్ని విషయాలను గాలికివదిలేసిందన్నారు. రాజధాని విషయం లో తామే పోరాటాలు చేస్తున్నట్టు ప్రతిపక్షం నాటకాలు ఆడు తోందన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్పై అధికార, ప్రతిపక్షాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ, బీజేపీ అఖండ మెజారిటీతో గెలుపొంది అమరావతి రైతులకు న్యాయం చేస్తామన్నారు.