పబ్జీ.. మళ్లీ వచ్చెన్‌!

ABN , First Publish Date - 2021-05-07T07:29:29+05:30 IST

ఆన్‌లైన్‌ మొబైల్‌ బ్యాటిల్‌ గేమ్‌ పబ్జీ భారత్‌లోకి మళ్లీ రానుంది. ‘పబ్జీ మొబైల్‌ ఇండియా’ పేరుతో ఇంతకు ముందు భారతీయులకు సుపరిచితమైన ఈ గేమ్‌ను...

పబ్జీ.. మళ్లీ వచ్చెన్‌!

  • కొత్త పేరుతో త్వరలో భారత్‌లోకి

న్యూఢిల్లీ, మే 6: ఆన్‌లైన్‌ మొబైల్‌ బ్యాటిల్‌ గేమ్‌ పబ్జీ భారత్‌లోకి మళ్లీ రానుంది. ‘పబ్జీ మొబైల్‌ ఇండియా’ పేరుతో ఇంతకు ముందు భారతీయులకు సుపరిచితమైన ఈ గేమ్‌ను.. ‘బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా’ పేరుతో త్వరలో అందుబాటులోకి రానుంది. దక్షిణ కొరియాకు చెందిన ఆ గేమింగ్‌ యాప్‌ మాతృసంస్థ క్రాఫ్టాన్‌ గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తొలుత ప్రీ-రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తామని, ఆ తర్వాత గేమ్‌ను భారత్‌లో లాంచ్‌ చేస్తామని ప్రకటించింది. వినియోగదారుల డేటాకు పూర్తిస్థాయిలో భద్రత ఉండేలా ఫీచర్లను అభివృద్ధి చేశామని, భారత్‌కు చిహ్నంగా మూడు రంగులతో ఈ గేమ్‌ను తీసుకువస్తున్నామని వివరించింది. కాగా.. భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న 118 చైనా యాప్‌లను గత ఏడాది సెప్టెంబరు 2న భారత్‌ నిషేధించింది. దక్షిణ కొరియాకు చెందిన యాప్‌ అయినా.. చైనా కంపెనీలకు భాగస్వామ్యం ఉండడంతో.. పబ్జీపైనా నిషేధం వేటు పడింది. 


Updated Date - 2021-05-07T07:29:29+05:30 IST