పాకిస్తానీ వలస కుటుంబాలకు సాయం చేయండి : సీఎం ఆదేశం

ABN , First Publish Date - 2020-04-09T20:20:54+05:30 IST

ప్రాంతాల్లోని వలస కుటుంబాలు ఈ నిర్ణయంతో బాగుపడతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో పాకిస్తానీ నుండి వచ్చిన

పాకిస్తానీ వలస కుటుంబాలకు సాయం చేయండి : సీఎం ఆదేశం

రాజస్థాన్ : రాజస్థాన్‌లో చిక్కుకుపోయిన పాకిస్తానీ వలస కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని జైపూర్, జోద్‌పూర్, బార్మార్, పాలీ, బికనేర్, జైసల్మేర్, జాలోర్, సిరోహి ప్రాంతాల్లోని వలస కుటుంబాలు ఈ నిర్ణయంతో బాగుపడతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో పాకిస్తానీ నుండి వచ్చిన దాదాపు 7,000 కుటుంబాలు నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


వీరి పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని, వెంటనే ప్రభుత్వం వారిని ఆదుకోవాలంటూ జోధ్‌పూర్ సామాజిక కార్యకర్త హిందూ సింగ్ జోధ్ సీఎం గెహ్లాట్‌కు లేఖ రాశారు. వెంటనే స్పందించిన గెహ్లాట్.... వారి ప్రస్తుత పరిస్థితిపై అధికారుల నుంచి ఓ రిపోర్టును తీసుకుని... ఆ కుటుంబాలకు వెంటనే సాయం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

Updated Date - 2020-04-09T20:20:54+05:30 IST