అర్హులకు ఉపాధి కల్పించండి

ABN , First Publish Date - 2022-05-21T04:44:21+05:30 IST

జాబ్‌కార్డు కలిగి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాఽధి పను లు కల్పించాలని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు.

అర్హులకు ఉపాధి కల్పించండి
కూలీల మస్టర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

ఉపాధి పనుల పరిశీలనలో కలెక్టర్‌

బద్వేలు,  మే 20: జాబ్‌కార్డు కలిగి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి పను లు కల్పించాలని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు. శుక్రవారం అట్లూరు మండలం కుంభగిరి, కొం డూరులో  జరుగుతున్న ఉపాధి ప నులను పరిశీలించిన కలెక్టర్‌ కూలీల తో నేరుగా మాట్లాడారు. రోజుకు వచ్చే కూలి, కొలతలపై, కూలీలు అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని ఆయన సూచించారు. 

కుంభగిరి చెరువును పరిశీలించి పనులు పూ ర్తి చేయాలని సూచించారు. ప్రక్షాళన చేయాలనే సంకల్పంతో చెరువులను పరిశీలిస్తున్నా మన్నారు. అనంతరం బద్వేలు మండలం వెంకటశెట్టిపల్లెలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, ఏపీడీ రామచంద్రారెడ్డి, ఎంపీడీఓ సుజాతమ్మ, తహశీల్దారు ఇం దిరా రాణి తదితరులు పాల్గొన్నారు.

నంద్యాలంపేట చెరువు పరిశీలన...

మైదుకూరు రూరల్‌,మే 20: నంద్యాలంపేట చెరువు అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులకు సూ చించారు. చెరువును అభివృద్ధి చే యాలనే ఉద్దేశంతో ఆయన చెరువును పరిశీలించారు. ఉపాధి పనుల, ఇరిగేష న్‌ అధికారులతో చర్చించారు. ఏవిధమైన పనులు చేస్తే చెరువు అభివృద్ధి జరుగుతుంద నే అంశంపై ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు.

Updated Date - 2022-05-21T04:44:21+05:30 IST