మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , First Publish Date - 2021-01-14T04:47:11+05:30 IST

మెరుగైన వైద్య సేవలు అందించాలి

మెరుగైన వైద్య సేవలు అందించాలి
బాధితురాలిని పరామర్శిస్తున్న కలెక్టర్‌ పౌసుమిబసు

వికారాబాద్‌ : ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులు, గర్భిణులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ పౌసుమిబసు తెలిపారు. బుధవారం సాయం త్రం వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి కల్తీ కల్లు బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ తిరిగి వెళుతుండగా అక్కడే ఉన్న కొందరు గర్భిణిని ఉదయం తీసుకువచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకురావడంతో కలెక్టర్‌ అక్కడి వైద్యులతో మాట్లాడి వెంటనే సదరు మహిళకు వైద్య సేవలు అందించి ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చేయాలని వైద్యులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట డీఎంహెచ్‌వో సుధాకర్‌ షిండే, డాక్టర్‌ రమ్య ఉన్నారు. 

Updated Date - 2021-01-14T04:47:11+05:30 IST