అంబులెన్సులను అందించండి
ABN , First Publish Date - 2021-05-15T07:25:30+05:30 IST
కరోనా సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కరోనా రోగు ల కోసం సంబంధిత జిల్లాలకు తమ నిధి నుంచి రెం డు అంబులెన్సులను అందించాలని
పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ సూచన
న్యూఢిల్లీ, మే 14 (ఆంధ్రజ్యోతి): కరోనా సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కరోనా రోగు ల కోసం సంబంధిత జిల్లాలకు తమ నిధి నుంచి రెం డు అంబులెన్సులను అందించాలని సూచించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ వ్యవహారాల ఇన్చార్జీలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలకు లేఖ రాశారు.