ప్రశాంత వాతావారణం కల్పించాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2021-10-21T04:52:44+05:30 IST
ప్రశాంత ఎన్నికల వాతావరణం కల్పించాలని కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు.
అట్లూరు, అక్టోబరు 20: ప్రశాంత ఎన్నికల వాతావరణం కల్పించాలని కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. అట్లూరు, వరికుంట గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ ఇందిరరాణితో కలిసి పరిశీలించిన ఆయన మాట్లాడుతూ ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను పోలింగ్ కేంద్రాల్లో కల్పించాలన్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా, ఓటు హక్కు వినియోగానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ నాగ చిరంజీవి, సీనియర్ అసిస్టెంట్ సుధాకర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.