స్టాఫ్నర్స్ల నిరసన
ABN , First Publish Date - 2021-06-15T04:58:00+05:30 IST
తమ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్టాఫ్నర్స్లు సోమవారం ఘోషాసుపత్రి వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
రింగురోడ్డు: తమ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్టాఫ్నర్స్లు సోమవారం ఘోషాసుపత్రి వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రెగ్యులర్ చేయాలని, విధి నిర్వహణలో చనిపోయిన వారికి రూ.50 లక్షలు చెల్లించాలని, విలేజ్ హెల్త్ క్లీనిక్స్ నియామకంలో ప్రాధాన్యం ఇవ్వాలని అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు భాగ్యలక్ష్మి, అనిత, రమాదేవి డిమాండ్ చేశారు. ఈ నెల 14 నుంచి 18 వరకూ నిరసన తెలియజేస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే, ఈ నెల 28న సహాయ నిరాకరణ చేస్తామని తెలిపారు.