మొక్కలను పెంచి పచ్చదనాన్ని కాపాడాలి
ABN , First Publish Date - 2020-06-29T11:02:29+05:30 IST
ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని జడ్పీ చైర్పర్సన్ వనజ, కలెక్టర్ హరిచందన, మునిసిపల్ చైర్ పర్సన్ గందె అనసూయ కోరారు. 6వ విడత
నారాయణపేట జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్
నారాయణపేట/నారాయణపేట టౌన్/ నారాయణపేట రూరల్/ ఊట్కూర్, జూన్ 28 : ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని జడ్పీ చైర్పర్సన్ వనజ, కలెక్టర్ హరిచందన, మునిసిపల్ చైర్ పర్సన్ గందె అనసూయ కోరారు. 6వ విడత హరితహారంలో భాగంగా ఆదివారం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటి వారు మాట్లాడారు. మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 10గంటలకు కలెక్టర్ హరిచందన తన నివాసంతోపాటు తన కార్యాలయంలో పరిసరాలను పరిశుభ్రం చేశారు. పూల కుండీలు, స్టోర్ రూంలు నీరు నిల్వఉండే ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టారు. నారాయణపేట మండలం సింగారం చౌరస్తా నుంచి అంబ్కేర్ చౌరస్తా వరకు గల రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఆర్అండ్బీ, అటవీశాఖ అధికారులకు సూచించారు. ఆదివారం రహదారి వెంట కలెక్టర్ పర్యటించారు.
ఆమె వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసన్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ట్కూర్ మండలంలోని నిడుగర్తి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఉపాధ్యాయులు హరితహారం నిర్వహించారు. ఉప సర్పంచ్ మొగులప్ప, ఎస్ఎంసీ చైర్మన్లు నర్సిములు, మఖ్బుల్ ఖాన్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం లక్ష్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శివరాజ్, ఉపాధ్యాయులు వెంకటప్ప, లియాఖత్, ఆంజనే యులు, శ్రీనివాస్, నర్సింహ, గిరిజప్ప, రాములు పాల్గొన్నారు.