పర్యావరణాన్ని కాపాడుకోవాలి: చైర్మన్
ABN , First Publish Date - 2020-06-06T11:26:31+05:30 IST
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాఽ ద్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని
ఖిల్లా, జూన్ 5: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాఽ ద్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శు క్రవారం ఆయన జిల్లా పరిష త్ ఆవరణలో మొక్కలు నా టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెట్లు లేక పోవడంతో వాతవరణం వేడుక్కుతోందన్నారు. ఇందుకు కారణం అవసరమైన మొక్కలు లేక పో వడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. మానవాళి మనుగడ సాగాలంటే పర్యావరణానికి పునరుజ్జీవం పోయాలని భూమి, నీరు జీవులను కాపాడుకోవాలన్నారు. అలాగే ఎంపీ జోగినపల్లి సంతోష్ కూడా గ్రీన్ ఛాలెంజ్ పేరిట ఎన్నో మొక్కలను నాటడం జరుగుతోందన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు గోపాల్ నగేష్, మనోహరరావ్, మాణిక్రావ్, అంజయ్య, పృథ్విరా జ్ తదితరులు పాల్గొన్నారు.