పక్కాగా అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2022-05-26T05:18:12+05:30 IST

పక్కాగా అభివృద్ధి పనులు

పక్కాగా అభివృద్ధి పనులు
కాశీంబౌళిలో క్రీడాస్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

మొయినాబాద్‌ రూరల్‌, మే25: ప్రభుత్వం చేపడుతున్న పల్లెప్రకృతి వనాల అభివృద్ధి, గ్రామాల్లో క్రీడాకారుల కోసం ఆట స్థలాల కేటాయింపుతో పాటు అభివృద్ధి పనులను పక్కాగా అమలు చేస్తున్నామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం కాశీంబౌళి గ్రామంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలోని బృహత్‌ పల్లెప్రకృతి వనంతో పాటు ఆటస్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. బృహత్‌ పల్లెప్రకృతి వనం చాలా అభివృద్ధి చెందిందని అధికారులను అభినందించారు. ఇలాగే ముందుకు వెళ్లి క్రీడాస్థలాల పరిశీలన చేసి నివేదికను అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ దిలీ్‌పకుమార్‌, డీపీఓ శ్రీనివా్‌సరెడ్డి, డీఆర్‌డీఓ ప్రభాకర్‌, మొయినాబాద్‌ ఎంపీపీ నక్షత్రం జయవంత్‌, ఎంపీడీఓ సంధ్య, సర్పంచ్‌లు మహేందర్‌రెడ్డి, బూర్గు రవళి గోపీకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్‌ రఘురాంరెడ్డి, నాయకులు సోమ మహేష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2022-05-26T05:18:12+05:30 IST