పోటీ పరీక్షల మార్కుల ఆధారంగా..సివిల్‌ న్యాయమూర్తులకు పదోన్నతి

ABN , First Publish Date - 2021-07-26T16:40:39+05:30 IST

పోటీపరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా సివిల్‌ న్యాయమూర్తుల పదోన్నతులు నిర్ణయించాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది...

పోటీ పరీక్షల మార్కుల ఆధారంగా..సివిల్‌ న్యాయమూర్తులకు పదోన్నతి

హైకోర్టు ఉత్తర్వులు

చెన్నై/ఐసిఎఫ్‌: పోటీపరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా సివిల్‌ న్యాయమూర్తుల పదోన్నతులు నిర్ణయించాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తుల పోస్టులకు 2009లో పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టారు. వారి సీనియారీటీ జాబితాను వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి సంజీబ్‌ బెనర్జీ, న్యాయమూర్తి సెంథిల్‌కుమార్‌ రామమూర్తిలతో కూడిన ధర్మాసనం, సీనియారిటీకి పోటీ పరీక్షలో పొందిన మార్కులను ఆధారంగా పరిగణించి పదోన్నతులు కల్పించాల ని,2009వ సంవత్సరం అనంతరం రాష్ట్రంలో నియమితులైన జూనియర్‌ సివిల్‌ న్యాయ మూర్తుల సీనియారిటీని పునఃపరిశీలించాలని హైకోర్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - 2021-07-26T16:40:39+05:30 IST