సాయిబాబాకు కరోనా ముప్పు!
ABN , First Publish Date - 2020-07-16T07:37:21+05:30 IST
జైల్లో ఉన్న తనకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా తన సమీపంలోకి వచ్చిందంటూ ఆయన తన కుటుంబ సభ్యులకు తెలిపారు...
- బెయిల్ ఇవ్వాలంటూ కుటుంబ సభ్యుల వినతి
న్యూఢిల్లీ, జూలై 15: జైల్లో ఉన్న తనకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా తన సమీపంలోకి వచ్చిందంటూ ఆయన తన కుటుంబ సభ్యులకు తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయిబాబా ప్రస్తుతం నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సాయిబాబాను తక్షణమే బెయి ల్ లేదా పెరోల్పై విడుదల చేయాలని, దీని వల్ల తన కుటుంబ సభ్యులు ఉంటున్న హైదరాబాద్ లేదా ఢిల్లీ లో తగిన వైద్య చికిత్స అందించే అవకాశం ఉంటుంద ని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. సాయిబాబా తన పరిస్థితి గురించి తన లాయర్, కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు జైలు అధికారులు ప్రత్యేక అనుమతి ఇచ్చారు.