ప్రొద్దుటూరు-జమ్మలమడుగు రాకపోకలు నిలిపివేత

ABN , First Publish Date - 2021-02-25T05:06:17+05:30 IST

ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు వెళ్లే దారిలో ఉన్న రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ -17వ గేటు మరమ్మతుల కారణంగా ఈనెల 25వ తేదీ గురువారం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీరు శ్రీనివాసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు-జమ్మలమడుగు రాకపోకలు నిలిపివేత

ప్రొద్దుటూరు రూరల్‌, ఫిబ్రవరి 24: ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు వెళ్లే దారిలో ఉన్న రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ -17వ గేటు మరమ్మతుల కారణంగా ఈనెల 25వ తేదీ గురువారం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీరు శ్రీనివాసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబందించిన వివరాలను ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో అధికారులకు, పోలీసు శాఖ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రయాణికులు గమనించి రైల్వేశాఖకు సహకరించాలని ఆయన కోరారు. శుక్రవారం ఉదయం యధావిఽధిగా రాకపోకలు సాగుతాయన్నారు.

Updated Date - 2021-02-25T05:06:17+05:30 IST