మార్కెట్‌యార్డులో సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-23T04:42:27+05:30 IST

ధాన్యం కొనుగోలు విషయంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

మార్కెట్‌యార్డులో సమస్యలను పరిష్కరించాలి
చేర్యాల మార్కెట్‌యార్డు ఆవరణలో రాస్తారోకో చేస్తున్న రైతు సంఘం నాయకులు

చేర్యాల, మే 22: ధాన్యం కొనుగోలు విషయంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఎదుట జనగామ-సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు నక్కల యాదవరెడ్డి మాట్లాడుతూ మార్కెట్‌లో విద్యుత్‌ సమస్య నెలకొనడంతో తూర్పార పట్టుకోవడానికి రైతులు ఇబ్బందులు పడటంతో పాటు రాత్రివేళ చీకట్లో భయాందోళనకు గురవుతున్నారన్నారు. ప్రతీ రైతుకు వెంటనే టోకెన్లు అందించి 24 గంటలు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని, తేమ, తాలు పేరిట దోపీడికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రాస్తారోకోకు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కత్తుల భాస్కర్‌రెడ్డి, పోనుగోటి శ్రీనివా్‌సరెడ్డి, మల్లేశం, రాజయ్య, ఎల్లమ్మ, రాజమణి, పోచవ్వ, నరహరి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T04:42:27+05:30 IST