పేదల సంక్షేమానికి ప్రాధాన్యం
ABN , First Publish Date - 2021-03-08T05:35:13+05:30 IST
సామాన్యుల సంక్షేమానికి తామంతా కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు.
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
చోడవరం, మార్చి 7: సామాన్యుల సంక్షేమానికి తామంతా కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను ఆదివారం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టాలో ఉన్నవారిని ఆదుకోవడానికి సీఎం ముందుంటారన్నారు. అనంతరం భోగాపురం గ్రామానికి చెందిన దొడ్డి లక్ష్మికి రూ.75 వేలు, పట్టణానికి చెందిన వంకా పరమేశ్వరికి రూ.లక్షా 70 వేలు, బగ్గు వెంకట వర్మకు రూ.2 లక్షలు, కోయిల వెంకటేశ్కు రూ.90 వేలు చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాజా, నాయకులు శ్రీకాంత్, పుల్లేటి వెంకటరావు, నెహ్రూ పాల్గొన్నారు.