పేదల అభ్యున్నతే ప్రధాని మోదీ సర్కార్ ధ్యేయం
ABN , First Publish Date - 2021-09-19T04:19:21+05:30 IST
పేదల అభ్యున్నతే ధ్యేయంగా కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ పనిచేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పేర్కొన్నారు.
బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్
మెదక్ అర్బన్, సెప్టెంబరు 18 : పేదల అభ్యున్నతే ధ్యేయంగా కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ పనిచేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రజాసేవలో అడుగుపెట్టి 20 ఏళ్లు అయిన సందర్భంగా 20 రోజుల పాటు అక్టోబరు 7 వరకు సేవా సమర్పణ పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అనేకసార్లు ప్రభుత్వాలు మారినా ప్రజలకు ప్రయోజనం చేకూరలేదన్నారు. కానీ మోదీ అధికారంలోకి వచ్చాక ఏ ప్రభుత్వంలో లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్ధన్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయ్, సుధాకర్రెడ్డి, సీనియర్ నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వీణ, అధికార ప్రతినిధి నందారెడ్డి, మధు, మహిపాల్, ఎంఎల్ఎన్రెడ్డి, జనార్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.