EPS met with Prime Minister Modi: ప్రధాని మోదీతో ఈపీఎస్ భేటీ
ABN , First Publish Date - 2022-07-24T16:29:30+05:30 IST
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) ఢిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ
ప్యారీస్(చెన్నై), జూలై 23: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) ఢిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దేశ 15వ రాష్ట్రపతిగా ఎంపికైన ద్రౌపది ముర్ముకు ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీ(Delhi)కి నేరుగా వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు అన్నాడీఎంకే సీనియర్ నేతలు దళవాయి సుందరం, ఎస్పీ వేలుమణి, ఎంపీ డా.తంబిదురై తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో కలసి పళనిస్వామి(Palaniswami) ప్రధానితో భేటీ అయ్యారు. అలాగే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో కూడా వీరు భేటీ అయ్యారు.