భక్తిశ్రద్ధలతో విగ్రహాల ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2021-06-22T05:33:06+05:30 IST

చీడిగుమ్మలలో నూతనంగా నిర్మించిన శివాలయంలో అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి విగ్రహాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సోమవారం ప్రతిష్ఠించారు.

భక్తిశ్రద్ధలతో విగ్రహాల ప్రతిష్ఠ
చీడిగుమ్మలలో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గణేశ్‌

 

గొలుగొండ, జూన్‌ 21 : చీడిగుమ్మలలో నూతనంగా నిర్మించిన శివాలయంలో అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి విగ్రహాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సోమవారం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌,  సిద్ధాంతి సుర్ల ఆదినారాయణ, ఆలయ కమిటీ ప్రతినిధులు సుర్ల గిరిబాబు, లెక్కల అప్పలనాయుడు, వైసీపీ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిటికెల భాస్కరనాయుడు, లెక్కల సత్యనారాయణ పాల్గొన్నారు. 

నర్సీపట్నం అర్బన్‌: వేములపూడి శివారు అప్పన్నపాలెంలో నిర్మించిన ఆలయంలో వినాయక విగ్రహాన్ని సోమవారం ప్రతిష్ఠించారు.   ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌  వైసీపీ నాయకుడు సుర్ల సత్యనారాయణ, అమలాపురం సర్పంచ్‌ శెట్టి అచ్చిరాజులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:33:06+05:30 IST