భక్తిశ్రద్ధలతో విగ్రహాల ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2021-06-22T05:33:06+05:30 IST
చీడిగుమ్మలలో నూతనంగా నిర్మించిన శివాలయంలో అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి విగ్రహాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సోమవారం ప్రతిష్ఠించారు.
గొలుగొండ, జూన్ 21 : చీడిగుమ్మలలో నూతనంగా నిర్మించిన శివాలయంలో అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి విగ్రహాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సోమవారం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేశ్, సిద్ధాంతి సుర్ల ఆదినారాయణ, ఆలయ కమిటీ ప్రతినిధులు సుర్ల గిరిబాబు, లెక్కల అప్పలనాయుడు, వైసీపీ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిటికెల భాస్కరనాయుడు, లెక్కల సత్యనారాయణ పాల్గొన్నారు.
నర్సీపట్నం అర్బన్: వేములపూడి శివారు అప్పన్నపాలెంలో నిర్మించిన ఆలయంలో వినాయక విగ్రహాన్ని సోమవారం ప్రతిష్ఠించారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేశ్ వైసీపీ నాయకుడు సుర్ల సత్యనారాయణ, అమలాపురం సర్పంచ్ శెట్టి అచ్చిరాజులు తదితరులు పాల్గొన్నారు.