పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన
ABN , First Publish Date - 2021-02-26T02:50:38+05:30 IST
పుదుచ్చేరిలో రాష్ట్రపతిపాలన విధించారు. ఈ నోటిఫికేషన్పై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గురువారం సంతకం చేశారు.
న్యూఢిల్లీ : పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ నోటిఫికేషన్పై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గురువారం సంతకం చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి రిపోర్టు అందగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. వారు పంపిన రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. పుదుచ్చేరిలో పరిపాలన కొనసాగించడానికి సాధ్యం కాదని ఎల్జీ ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ రిపోర్ట్పై రాష్ట్రపతి సంతృప్తి చెందారని కార్యాలయం పేర్కొంది.