రాష్ట్రపతి, పీఎం బక్రీద్ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-07-21T15:52:34+05:30 IST

బక్రీద్ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన

రాష్ట్రపతి, పీఎం బక్రీద్ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : బక్రీద్ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా ఈద్ ముబారక్ చెప్పారు. కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని కోరారు.


రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ప్రజలందరికీ ఈద్ ముబారక్. ప్రేమ, త్యాగ భావాల పట్ల గౌరవాన్ని వ్యక్తీకరించడానికి, సమ్మిళిత సమాజంలో సమైక్యత, సౌహార్దతల కోసం కలిసికట్టుగా పని చేయడానికి స్ఫూర్తినిచ్చే పండుగ ఈద్-ఉల్-జుహా. కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించడానికి, అందరి సంతోషం కోసం పని చేయడానికి దృఢంగా నిర్ణయించుకుందాం’’ అని పేర్కొన్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఈద్-ఉల్-అదా సందర్భంగా శుభాకాంక్షలు. ఈ పండుగ సమష్టి తాదాత్మ్యం, సామరస్య భావాలను; అత్యుత్తమ సేవలో సంఘటితత్వాన్ని వృద్ధి చేయాలి’’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-21T15:52:34+05:30 IST