మొక్కలను సంరక్షించాలి : అదనపు కలెక్టర్
ABN , First Publish Date - 2022-05-20T05:54:11+05:30 IST
హరితహారంలో నాటిన మొక్కలను వేసవిలో నీళ్లు పోసి సంరక్షించాలని అదనపు కలెక్టర్ హేమంత్కేశవ్ పాటిల్ అన్నారు.
మద్దిరాల, మే 19 : హరితహారంలో నాటిన మొక్కలను వేసవిలో నీళ్లు పోసి సంరక్షించాలని అదనపు కలెక్టర్ హేమంత్కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం మండలంలోని గోరెంట్ల గ్రామశివారులో ఎస్సారెస్పీ కాల్వల భూములను ఆయన పరిశీలించి, మాట్లాడారు. హరితహారం నాటికి మొక్కలు నాటేందుకు అధికారులు సంసిద్ధం కావాలన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలోని 3.25 లక్షల మొక్కలు నాటేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కల సంరక్షకులకు నెలకు రూ.6 వేల చొప్పున వేతనం అందజేస్తామన్నారు. ఆయన వెంట సూర్యాపేట ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎస్సారెస్పీ ఈఈ విజయ్కుమార్, డీఈ హరికృష్ణ, ఏఈ శ్రీకాంత్, తహసీల్దార్ అమీద్సింగ్, ఎంపీడీవో సరోజ, సర్వేయర్ రామనర్సయ్య, పంచాయతీ కార్యదర్శి మంగమ్మ, వీఆర్ఏలు పాల్వాయి వెంకన్న, రమేష్ పాల్గొన్నారు.