చైనాతో యుద్ధానికి సిద్ధం
ABN , First Publish Date - 2020-10-19T06:25:47+05:30 IST
సరిహద్దుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది.
షా
న్యూఢిల్లీ, అక్టోబరు 18: సరిహద్దుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. చైనాకు ఒక్క అంగుళం భూమి కూడా వదిలే ప్రశ్నేలేదు’ అని ఆయన చెప్పారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ చైనా సైన్యాన్ని ఆ దేశాధినేత జిన్పింగ్ ఇటీవల హెచ్చరించారు.
అదే సమయంలో వాస్తవాధీన రేఖ వద్ద సంక్షోభ పరిష్కారానికి రెండు దేశాల సైన్యాధికారులు చర్చలు జరుపుతున్నారని షా చెప్పారు. ‘సరిహద్దులను కాపాడుకునే విషయంలో మనకు ప్రపంచదేశాలన్నీ బాసటగా ఉన్నాయి’ అని షా పేర్కొన్నారు.