నాయకుల ముందస్తు అరెస్టులు
ABN , First Publish Date - 2021-07-31T06:16:08+05:30 IST
మంత్రి కే తారకరామారావు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన నేప థ్యంలో శుక్రవారం సిరిసిల్లలోని ప్రతిపక్ష పార్టీల నాయ కులను ముందస్తుగా అరెస్టు చేశారు.
సిరిసిల్ల టౌన్, జూలై 30: మంత్రి కే తారకరామారావు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన నేప థ్యంలో శుక్రవారం సిరిసిల్లలోని ప్రతిపక్ష పార్టీల నాయ కులను ముందస్తుగా అరెస్టు చేశారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పట్టణానికి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తుండడంతో శుక్రవారం తెల్లవారు జామునే పోలీ సులు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్తో పాటు ఇతర నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలిగేటి రాజశేఖర్ను పోలీస్టేషన్కు తరలిం చారు. ప్రతి పక్షాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు.
బీజేపీ నాయకుల అరెస్ట్
సిరిసిల్ల రూరల్: భారతీయ జనతా పార్టీ ఆధ్వ ర్యంలో హైదరాబాద్లోని ఇందిరపార్క్ వద్ద చేపట్టిన బడుగుల అత్మగౌరవ పోరు దీక్షకు వెళ్లకుండా శుక్ర వారం సిరిసిల్లలో ఆ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యుడు మేకల కమలాకర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యుడు బర్కం నవీన్యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సిరస్వాల్ కైలాస్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు మొగిలి రాజు, దళిత మోర్చా పట్టణ అధ్యక్షుడు పెరుమాండ్ల ప్రవీణ్కుమార్, పట్టణ ఉపాఽధ్య క్షుడు ఉరగొండ రాజును పోలీస్స్టేషన్కు తరలించారు.
అరెస్ట్లు అప్రజాస్వామికం
బీజేపీ నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికమని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణువర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమితోపాటు గిరిజనులు సాగు చేసు కుంటున్న పోడు భూములకు పట్టాలను అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ చేసిన డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. టీఅర్ ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఅర్ పర్యటనకు వచ్చిన ప్రతీసారి ముందస్తు అరెస్టులు చేయడం సరికాదన్నారు.
ఇల్లంతకుంట: బడుగుల ఆత్మగౌరవ పోరు సమావేశానికి వెళ్తున్నారనే సమాచారంతో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మండల ఉపాధ్యక్షుడు గుంటి మహేష్, పున్ని సంపత్, పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రావణ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అనగోని అవినాష్, హరీష్, అనీల్ పాల్గొన్నారు.
కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
తంగళ్లపల్లి: కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్లను నిరసిస్తూ తంగళ్లపల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాల్గం ప్రవీణ్కుమార్తోపాటు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన యూత్ కాంగ్రెస్ నాయకులు మండల కేంద్రంలోని సిరిసిల్ల- సిద్ధిపేట ప్రధాన రహదారిపై కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో గడ్డం మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
కోనరావుపేట : అత్మగౌరవ దీక్షకు వెళ్లకుండా కోనరావుపేటలో బీజేపీ నాయకలను పోలీసులు ముందుస్టుగా అరెస్టు చేశారు. అరెస్టు అయన వారిలో గొట్టే రామచంద్రం, గోపాడి సురేందర్రావు, జవ్వాజి తిరుపతిగౌడ్ తదితరులు ఉన్నారు.