మలేరియా నియంత్రణకు ముందస్తు చర్యలు
ABN , First Publish Date - 2021-04-17T04:49:34+05:30 IST
మన్యంలో మలేరియా నియంత్రకు దోమల మందు పిరికారీ పనులు సమర్థవంతంగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో డాక్టర్. ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు.
ఐటీడీఏ పీవో ఎస్.వెంకటేశ్వర్
పాడేరు ఏప్రిల్ 16: మన్యంలో మలేరియా నియంత్రకు దోమల మందు పిరికారీ పనులు సమర్థవంతంగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో డాక్టర్. ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం 11 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు, సచివాలయం సిబ్బందితో ఐటీడీఏ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే నెల 31 నాటికి 1,545 గ్రామాల్లో దోమల మందు పిచికారీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పిచికారీ పర్యవేక్షణ బాధ్యత వలంటీర్లు, మహిళా పోలీసులకు అప్పగించాలన్నారు. ఇంటి లోపల, బయట తప్పనిసరిగా దోమల మందు పిచికారీ చేయాలన్నారు. పిచికారీలో సర్పంచ్, వార్డు సభ్యులను భాగస్వామ్యం చేయాలన్నారు. షెడ్యూల్డ్ ప్రకారం పనులు జరిగేలా వైద్యాధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా మలేరియా అధికారి వై.మణి, డీఎల్డీవో జి.చిట్టిరాజు, డీఎల్పీవో పీఎస్.కుమార్ పాల్గొన్నారు.