‘పీఆర్సీని అమలు చేయాలి’
ABN , First Publish Date - 2020-02-20T07:12:24+05:30 IST
ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని అమలుచేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం జాక్టో, యూఎ్సపీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
మెదక్ అర్బన్, ఫిబ్రవరి 19 : ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని అమలుచేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం జాక్టో, యూఎ్సపీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ప్రణీద్కుమార్, కాముని రమేశ్, సత్యనారాయణ, పద్మారావు మాట్లాడుతూ జూలై 1, 2018 నుంచి ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా.. సీఎం కేసీఆర్ అదే సంవత్సరం జూన్ 2 నుంచి ఐఆర్, ఆగస్టు 15 నుంచి పీఆర్సీ అమలుచేస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకూ హామీ నెరవేరలేదన్నారు. పేరివిజన్ కమిషన్ను నియమించి మొదటి నెలరోజుల్లో నివేదిక సమర్పించాల్సిందిగా గడువు విధించి, పలుమార్లు ఆ గడువును పొడిగిస్తూ 24న చివరితేదీగా నిర్ణయించారు. మళ్లీ ఆ గడువు 8 నెలలపాటు డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేయడం సమంజసం కాదన్నారు. వెంటనే ఆ ఉత్తర్వులు రద్దుచేసి పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 69 శాతం ఫిట్మెంట్తో నూతన పీఆర్సీని అమలు చేయాలన్నారు. అనంతరం మంత్రి హరీశ్రావుకు పీఆర్సీ అమలుచేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణ సమితి, పోరాట కమిటీ నాయకులు హీరాలాల్, కిషన్, హైమద్, సుధాకర్ పాల్గొన్నారు.