పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేయాల్సిందే!
ABN , First Publish Date - 2022-01-20T06:24:44+05:30 IST
ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని జాక్టో జిల్లా చైర్మన్ డీజీ నాథ్ కోరారు.
జాక్టో జిల్లా చైర్మన్ డీజీ నాథ్
పాయకరావుపేట, జనవరి 19 : ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని జాక్టో జిల్లా చైర్మన్ డీజీ నాథ్ కోరారు. బుధవారం పాయకరావుపేటలో బుధవారం ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐఆర్ కంటే ఫిట్మెంట్ ఎక్కువ ఇవ్వాలని, హెచ్ఆర్ఏ పాత విధానాన్ని కొనసాగించాలని, సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్న డిమాండ్లతో జాక్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా గురువారం డివిజన్ కేంద్రాల్లో నిర్వహించే నిరసన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరు కావాలని ఆయన కోరారు. పీఆర్టీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు ఏవీ సూర్యనారాయణ, మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు వీరభద్రరావు, మోహన్ పట్నాయక్ పాల్గొన్నారు.