ఇద్దరి మహిళల పట్ల ప్రేమ వ్యవహారం...

ABN , First Publish Date - 2022-02-24T19:15:38+05:30 IST

ప్రకాశం జిల్లా: ఒంగోలులో ఇద్దరి మహిళల పట్ల ప్రేమ వ్యవహారం వివాదానికి దారి తీసింది.

ఇద్దరి మహిళల పట్ల ప్రేమ వ్యవహారం...

ప్రకాశం జిల్లా: ఒంగోలులో ఇద్దరి మహిళల పట్ల ప్రేమ వ్యవహారం వివాదానికి దారి తీసింది. సుమలత అనే మహిళ తన కుమార్తెను ట్రాప్ చేసిందని యువతి తల్లిదండ్రులు గొడవకు దిగడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఒంగోలు రంగు తోటలో నివాసం ఉంటున్న సుములత అనే మహిళకు ఒంగోలు శివారులోని అమరావతి నగర్‌కు చెందిన రమ్య అనే యువతితో నాలుగు నెలల క్రితం టిక్ టాక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి టిక్ టాక్ వీడియోలు చేశారు. పలు సినిమా పాటలకు స్టెప్‌లు కూడా వేశారు. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నట్లు కొన్ని వీడియోలు కూడా టిక్ టాక్‌లో పెట్టారు.


సుమలతతో పరిచయం ఏర్పడిన తర్వాత రమ్య తల్లిదండ్రులను వదిలిపెట్టి సుమలత ఇంట్లోనే ఉంటోంది. ఇంటికి రావాలని రమ్య తల్లిదండ్రులు పలుమార్లు పిలిచినా సుమలతను వదిలిపెట్టలేదు. దీంతో అనుమానం వచ్చి.. ఇద్దరి వ్యవహారంపై ఆరా తీశారు. రమ్యను సుమలత ట్రాప్ చేసిందని వారికి అర్థమైంది. దీంతో సుమలతను ఒంగోలు కలెక్టరేట్ ఎదుట రమ్య కుటింబీకులు నిలదీశారు. అక్కడ గొడవ పడుతుండగా చూసిన పోలీసులు వారిని విచారణ కోసం స్టేషన్‌కు తీసుకువెళ్లారు.


Updated Date - 2022-02-24T19:15:38+05:30 IST