రూ.25 కోట్ల విలువ గల Vinayaka విగ్రహం.. అమ్మకానికి పెట్టిన Hyderabad వాసి

ABN , First Publish Date - 2022-06-13T21:00:00+05:30 IST

మరకతపచ్చతో ఉన్న పురాతన పంచముఖ వినాయకుడు విగ్రహాన్ని అమ్మకానికి పెట్టగా...

రూ.25 కోట్ల విలువ గల Vinayaka విగ్రహం.. అమ్మకానికి పెట్టిన Hyderabad వాసి

Prakasam జిల్లా: మరకతపచ్చతో ఉన్న పురాతన పంచముఖ వినాయకుడు (Vinayakudu) విగ్రహాన్ని అమ్మకానికి పెట్టగా ప్రకాశం జిల్లా పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. మరకతపచ్చతో రూపొందిన పురాతన పంచముఖ గణేష్ విగ్రహాన్ని యర్రగొండపాలెంలో హైదరాబాద్‌కు చెందిన ఇంద్రసేనారెడ్డి అమ్మకానికి పెట్టారు. 


ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. మారువేషంలో విగ్రహం కొనుగోలు దారులుగా వెళ్లారు. విగ్రాహాన్ని రూ. 25 కోట్లకు కొనుగోళ్లు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. చివరిలో అసలు విషయం బయటపెట్టి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే విగ్రహాన్ని గతంలో తాను కొనుగోలు చేశానని తెలంగాణ హైకోర్టు ద్వారా సొంతం చేసుకున్నానని పోలీసులకు ఇంద్రాసేనారెడ్డి చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన వద్ద ఉన్న పత్రాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Updated Date - 2022-06-13T21:00:00+05:30 IST