ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2022-08-13T05:52:57+05:30 IST
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మద్దూరు (కంకిపాడు), ఆగస్టు 12 : వరద ఉధృతి అధికం గా ఉండటంతో కృష్ణానదీ పరి వాహక ప్రాంత ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని కంకిపాడు తహసీల్దార్ టి.వి.సతీష్ అన్నారు. మండలంలోని మద్దూరు, కాసర నేనివారిపాలెం కృష్ణానదీ పరివాహక ప్రాంతాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, మండలంలోని మద్దూరు కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో వరద ఉధృతి కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిప్పల దాసు, కార్యదర్శి చింతా కిరణ్కుమార్, రెవెన్యూ అధికారులు మద్దూరు రఘురామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.