ప్రజలకు శాపంగా వైసీపీ పాలన : సోమిరెడ్డి
ABN , First Publish Date - 2022-07-06T03:33:02+05:30 IST
ప్రజలకు శాపంగా వైసీపీ ప్రభుత్వ పాలన మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొ
ముత్తుకూరు, జూలై5: ప్రజలకు శాపంగా వైసీపీ ప్రభుత్వ పాలన మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తాళ్లపూడిలో మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గౌరవసభలో ఆయన ప్రసంగించారు. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో అరాచకాలు, ఆక్రమాలు తప్ప అభివృద్థి మాటే లేదన్నారు. మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డికి అక్రమ కేసులు పెట్టించడంలో ఉన్న శ్రద్ధ అభివృద్థిపై లేదన్నారు. అంతకుముందు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ కరపత్రాలను పంచిపెట్టారు. కార్యక్రమంలో ముత్తుకూరు, టీపీగూడూరు మండలాల నాయకులు పల్లంరెడ్డి రామ్మోహన్రెడ్డి, గుమ్మడి రాజాయాదవ్, ఈపూరు మునిరెడ్డి, నీలం మల్లికార్జునయాదవ్, మాచిరెడ్డి శ్రీధర్రెడ్డి, ఏకొల్లు కోదండయ్య, విష్ణువర్థన్రావు తదితరులు పాల్గొన్నారు.