‘ప్రాణ వాయువు’ ఆన్‌లైన్‌ పోర్టల్‌పై సమావేశం

ABN , First Publish Date - 2021-05-14T15:00:10+05:30 IST

కొవిడ్‌ బాధితుల ఆక్సిజన్‌..

‘ప్రాణ వాయువు’ ఆన్‌లైన్‌ పోర్టల్‌పై సమావేశం

విజయవాడ సిటీ: కొవిడ్‌ బాధితుల ఆక్సిజన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘ప్రాణ వాయువు’ ఆన్‌లైన్‌ పోర్టల్‌ గురించి జేసీ ఎల్‌.శివశంకర్‌ ఆధ్వర్యంలో డిస్ట్రిక్‌ ఆక్సిజన్‌ వార్‌ రూమ్‌లో గురువారం జిల్లా సమావేశం జరిగింది. ఆక్సిజన్‌ రిఫిల్లింగ్‌ సెంటర్‌లో సమీప తహసీల్దార్‌, ఎంపీడీవోను నియమించారు. సబ్‌కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్‌ ఆఫీసర్లను ప్రతి డివిజన్‌లో ప్రత్యేకంగా నియమించారు. వార్‌ రూమ్‌లో 24గంటలు పని చేసేందుకు మూడు బృందాలు ఏర్పాటుచేశారు. డిమాం డ్‌ ఆసె్‌సమెంట్‌ టీం, లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ కేటాయింపు బృందం, వాహన ట్రాకింగ్‌ బృందం, సరఫరా పర్యవేక్షణ బృందం (జేసీ కంట్రోల్‌ టీమ్‌ లో, రీఫిల్లింగ్‌ స్టేషన్‌లో), ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల ఆక్సిజన్‌ పర్యవేక్షణ బృందం, ఆడిట్‌ బృందం, సాంకేతిక మద్దతు బృందం, బడ్జెట్‌ బృందం, ఇంటర్‌ డిపార్ట్‌మెంటల్‌ కో-ఆర్డినేషన్‌ బృందం, ఎలక్ర్టికల్‌ బృందం నిర్విరామంగా పనిచేస్తున్నాయి. పంబంధిత ఉత్తర్తులను జేసీ జారీ చేశారు. జిల్లాలోని 76 కొవిడ్‌ ఆసుపత్రుల నోడల్‌ ఆఫీసర్లకు, ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌ ఏజెన్సీలకు, ఆక్సిజన్‌ తయారీ కంపెనీలకు, జేసీకి ‘ప్రాణవాయువు’ ఆన్‌లైన్‌ పోర్ట ల్‌ లాగిన్‌ ఇప్పటికే ఇచ్చారు. ఆక్సిజన్‌ కొలతలను దీనిద్వారా ప్రభుత్వానికి పంపించాలన్నారు.


Updated Date - 2021-05-14T15:00:10+05:30 IST