అల్లోల దివ్యారెడ్డికి పవర్ ఉమెన్ అవార్డు
ABN , First Publish Date - 2021-03-09T05:57:47+05:30 IST
క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యా రెడ్డి ప్రతిష్టాత్మక ‘పవర్ ఉమెన్’ అవార్డుకు ఎంపికయ్యారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బెంగళూర్లో ప్రదానం
నిర్మల్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యా రెడ్డి ప్రతిష్టాత్మక ‘పవర్ ఉమెన్’ అవార్డుకు ఎంపికయ్యారు. బెంగళూర్లోని టౌన్ హాల్లో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అల్లోల దివ్యారెడ్డి ఈ అవార్డును కర్ణాటక స్పీకర్ విశ్వేశ్వర్హెగ్డే కగేరి, పరిశ్రమల శాఖ మంత్రి జగదీష్షెట్కార్ చేతుల మీదుగా అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్కలాం ఆధ్వర్యంలో స్థాపించిన లీడ్ ఇండియా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా వివిధరంగాల్లో సేవలు అందించిన వారిని గుర్తిం చి ఈ అవార్డుకు ఎంపిక చేసింది. క్లిమామ్ సహ వ్యవస్థాపకులు అల్లోల గౌతమ్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఆవుల్ని సంరక్షించుకోవడంతో పాటు ముందు తరాలకు ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించాలనే బలమైన సంకల్పంతో అల్లోల దివ్యారెడ్డి క్లిమామ్ వెల్నెస్ ఫార్మ్స్ ప్రారంభించారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడంతో పాటు స్వచ్ఛ మైన ఆవు పాలు, వాటి ఆధారిత ఉత్పత్తుల పంపిణీతో పాటు ఇతర సేవ లను క్లిమామ్ అందిస్తుంది. ఐదేండ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా ప్రారం భమైన క్లిమామ్ వెల్నెస్ అండ్ ఫార్మ్స్ అంతర్జాతీయ స్థాయిలో పేరు గాంచింది. క్లిమామ్ పేరుతో దివ్యారెడ్డి అందిస్తున్న సేవలకు గానూ పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమెను వరించాయి.