డొంకరాయి పవర్‌కెనాల్‌ మరమ్మతులకు ఎల్‌సీ అనుమతులు మంజూరు కాలేదు

ABN , First Publish Date - 2022-05-23T06:51:42+05:30 IST

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉన్నందువలనే సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయి పవర్‌కెనాల్‌ మరమ్మతులకు ఎల్‌సీ అనుమతులు మంజూరు కాలేదని ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ (సివిల్‌) సుబ్బారావు తెలిపారు.

డొంకరాయి పవర్‌కెనాల్‌ మరమ్మతులకు ఎల్‌సీ అనుమతులు మంజూరు కాలేదు

మోతుగూడెం, మే22: రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉన్నందువలనే సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయి పవర్‌కెనాల్‌ మరమ్మతులకు ఎల్‌సీ అనుమతులు మంజూరు కాలేదని ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ (సివిల్‌) సుబ్బారావు తెలిపారు. ఏపీ జెన్‌కో విద్యుత్‌ సౌధ (కేంద్ర కార్యాలయం, విజయవాడ) నుంచి వచ్చిన ఆయన ఆదివారం సీలేరు కాంప్లెక్స్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జెన్‌కో అతిథి గృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో విద్యుత్‌ డిమాండ్‌ బాగా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సీలేరు కాంప్లెక్సు కెనాల్‌ మరమ్మతులకు 30 రోజుల ఎల్‌సీ అనుమతులు మంజూరు చేయలేమని గ్రిడ్‌ అధికా తేల్చిచెప్పడంతో కెనాల్‌ పనులను ఎన్ని రోజుల్లో  పూర్తి చేయగలమో అధ్యయనం చేయడానికి వచ్చామన్నారు. తాము వచ్చామన్నారు. అలాగే పొల్లూ రు జల విద్యుత్‌ కేంద్రాన్ని పరిశీలించామన్నారు. సీలేరు కాంప్లెక్సులోని జలాశయాలు, రెగ్యులే టర్‌ డ్యాం పనితీరుపై స్ధానిక అధికారులను అడిగి ఆరా తీశారు. సూపరిం టెండెంట్‌ ఇంజనీర్లు శేఖర్‌ (విద్యుత్‌ సౌధ) కేకేవీ ప్రశాంత్‌కుమార్‌, ఈఈ జాకీర్‌ హుస్సేన్‌  పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T06:51:42+05:30 IST