సమస్యలు తలెత్తకూడదు

ABN , First Publish Date - 2020-09-20T10:41:03+05:30 IST

జిల్లాలో ఆదివారం నుంచి జరగనున్న గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకూడదని జేసీ కె

సమస్యలు తలెత్తకూడదు

జేసీ శ్రీనివాసులు

కలెక్టరేట్‌, సెప్టెంబరు 19: జిల్లాలో ఆదివారం నుంచి జరగనున్న గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకూడదని జేసీ కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని సచివాలయ పరీక్షల మెటీరియల్‌ స్టాక్‌ పాయింట్‌ను   శనివారం ఆయన సందర్శించారు. అనంతరం మండలాల వారీగా  మెటీరియల్‌ పంపిణీ వివరాలను జడ్పీ సీఈవో జి.చక్రధరరావును అడిగి తెలుసుకున్నారు. రూట్‌ అధికారులకు సూచనలు చేశారు.


మెటీరియల్‌ను తరలిస్తున్న వాహనాలు గమ్యస్థానాలకు చేరుకొనేలా చూడాల్సిన బాధ్యత రూట్‌ అధికారులదేనని సృష్టం చేశారు. మెటీరియల్‌ సరిపోయిందీ.. లేనిదీ పరిశీలించుకోవాలన్నారు. ఒక్కో మండలానికి ఒక్కో కోడ్‌ కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-20T10:41:03+05:30 IST