నాసిరకం మద్యం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

ABN , First Publish Date - 2022-06-29T06:06:32+05:30 IST

డిజిటల్‌ రూపంలో మద్యం అమ్మకాలు జరపకుండా నగదు రూపంలో విక్రయిస్తూ రాష్ట్రాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లూటీ చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

నాసిరకం మద్యం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
జూపూడిలో మాట్లాడుతున్న దేవినేని ఉమా

జూపూడి బాదుడే - బాదుడులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

జూపూడి(ఇబ్రహీంపట్నం), జూన్‌ 28: డిజిటల్‌ రూపంలో మద్యం అమ్మకాలు జరపకుండా నగదు రూపంలో విక్రయిస్తూ రాష్ట్రాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లూటీ చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జూపూడిలో మంగళవారం బాదుడే-బాదుడులో ఆయన ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విష పదార్థాలతో ప్రపంచంలోనే ఎక్కడ లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో విక్రయిస్తున్నారన్నారు.  ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. పంటల బీమా పథకంలో రైతులు నష్టపోతే వైసీపీ నాయకులు, పార్టీ మద్దతుదారులు లాభపడుతున్నారన్నారు. లేని బీమా కంపెనీని సృష్టించి రైతులను మోసం చేస్తున్నారన్నారు. పథకాల పేరుతో రాష్ట్రన్ని ఆధోగతి పాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రామినేని రాజశేఖర్‌, అవుటి రాజేశ్వరరావు, కొల్లిమర్ల నరసింహస్వామి, సైకం సాంబశివరావు, గౌర్నినేని పిచ్చేశ్వరరావు, పిచ్చగోళ్ల ఇజ్రాయేరాజు, దొప్పలపూడి రమేష్‌, పీతా చంద్రవర్మ, కొర్రా గోపి, రెంటపల్లి లక్ష్మణ, ములుగు సురేష్‌, రామినేని భవాని ప్రసాద్‌, రామినేని చంద్రశేఖర్‌, షేక్‌ కరిముల్లా, సుంకర విష్ణు, చుట్టుకుదురు శ్రీనివాసరావు, గొల్లపూడి కరిముల్లా, కూచిపూడి దిలీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-06-29T06:06:32+05:30 IST