పూలే చిరస్మరణీయుడు

ABN , First Publish Date - 2020-11-29T05:34:27+05:30 IST

అణగారిన వర్గాల అభివృద్ధికి మహాత్మాజ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కో సం సీఎం జగన్మోహన్‌ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర వి ద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

పూలే చిరస్మరణీయుడు
పూలే చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రులు బాలినేని, సురేష్‌

మంత్రులు బాలినేని, సురేష్‌


ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 28 : అణగారిన వర్గాల అభివృద్ధికి మహాత్మాజ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కో సం సీఎం జగన్మోహన్‌ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర వి ద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. శనివారం ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో బీసీసెల్‌ విభాగం అధ్యక్షుడు కఠారి శంకర్‌ ఆధ్వర్యంలో పూలే వర్ధంతి స భ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు పూలే చిత్రప టానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించా రు. కార్యక్రమంలో శ్రీవైష్ణవ, మేదర కార్పొరేషన్‌ చైర్మ న్లు మనోజ్‌కుమార్‌, లలిత నాంచారమ్మ, వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, ఏఎంసీ చైర్మన్‌ కొఠారి రామచంద్రరావు పాల్గొన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా కలెక్టర్‌ పోలా  భాస్కర్‌ వెనుకబడిన తర గతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్‌సెం టర్‌లోని పూలే విగ్రహానికి నివాళులర్పించారు. 


Updated Date - 2020-11-29T05:34:27+05:30 IST