నాయిని సతీమణి అహల్యకు నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు

ABN , First Publish Date - 2020-10-28T09:51:18+05:30 IST

అనారోగ్యంతో మరణించిన మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్యకు మంత్రులు, రాజకీయ ప్రముఖులు అంతిమ వీడ్కోలు పలికారు.

నాయిని సతీమణి అహల్యకు నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు

బంజారాహిల్స్‌, ఆక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో మరణించిన మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్యకు మంత్రులు, రాజకీయ ప్రముఖులు అంతిమ వీడ్కోలు పలికారు. అపోలో అస్పత్రి నుంచి ఆమె మృత దేహాన్ని మంగళవారం ఉదయం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసాలకు తరలించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన మహిళలు మంత్రుల నివాసాలకు వచ్చి కంట తడిపెట్టారు. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, హోంమంత్రిమహమూద్‌ అలీ, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, సత్యవతీరాథోడ్‌ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌, ముఠాగోపాల్‌,పిడమర్తి లింగయ్య, కాలేరు వెంకటేష్‌, బాల్కసుమన్‌, జీవన్‌రెడ్డి మేయర్‌ బొంతురామ్మోహన్‌ తదితరులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మంత్రులు స్వయంగా మంత్రుల నివాసాల వెలుపలి వరకూ అహల్య పాడె మోశారు. రాయదుర్గంలోని మహాప్రస్థానంలో కుమారుడు దేవేందర్‌రెడ్డి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

Updated Date - 2020-10-28T09:51:18+05:30 IST